కోల్ మైన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. 25 మంది మృతి

by Disha Web Desk 12 |
కోల్ మైన్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. 25 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కోల్ మైన్ అగ్నిప్రమాదం జరిగి దాదాపు 25 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం చైనా దేశంలోని ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని బొగ్గు కంపెనీ కార్యాలయ భవనంలో చోటు చేసుకుంది. నాలుగు అంతస్తులున్న భవనంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న 25 మంది.. ఊపిరాడక చనిపోయారు. అలాగే మరికొంతమంది బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా.. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

Most Viewed