పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయండి : మాణిక్యం ఠాగూర్

by  |
పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయండి : మాణిక్యం ఠాగూర్
X

దిశ కొడంగల్ : కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ‌ మాణిక్యం ఠాగూర్, బోస్ రాజ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వంశీచందర్ రెడ్డి పిలుపునిచ్చినట్లు రేవంత్ మిత్ర మండలి అధ్యక్షులు దాము తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆధ్వర్యంలో కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ మిత్ర మండలి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రేవంత్ మిత్ర మండలి సభ్యులు రమేష్, చింటూ, కృష్ణ, ప్రవీణ్ ,అప్పి, వెంకటయ్య, రాజు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed