భారత్‌కు ‘సెమీస్’ గండం.. పురుషుల బాటలోనే మహిళలు..!

by  |
arjentina
X

దిశ, వెబ్‌డెస్క్ : టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు సెమీస్ కలిసి రావడం లేదు. ఇటీవల బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, నిన్న పురుషుల హాకీ జట్టు, తాజాగా మహిళల హాకీ జట్టు కూడా సెమీ ఫైనల్‌లోనే భంగపాటుకు గురయ్యారు. నిన్న క్వార్టర్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాను 1-0 తేడాతో ఓడించి సెమీ ఫైనల్ చేరిన మహిళల హాకీ జట్టు నేడు ఆర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో 2-1గోల్స్ తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్ పసిడి ఆశలు మరోసారి గల్లంతయ్యాయి.

మ్యాచ్ ప్రారంభంలో గుర్జిత్ కౌర్ తొలి గోల్ కొట్టడంతో ఇండియా ఆధిక్యంలో నిలువగా.. ఆ తర్వాత ఆర్జెంటీనా ప్లేయర్లు వరుసగా గోల్స్ కొట్టారు. వారిని అడ్డుకోవడంలో భారత అథ్లెట్లు విఫలం కావడంతో మరోసారి సిల్వర్ మెడల్ చిక్కినట్టే చిక్కి చేజారింది. కాగా, కాంస్య పతకం కోసం జరిగే పోరులో గ్రేట్ బ్రిటన్‌తో భారత జట్టు మరోసారి తలపడనుంది.



Next Story

Most Viewed