భయం వెంటాడుతోంది.. ఎక్స్ రే కోసం వచ్చి కుప్పకూలిన మహిళ

by  |
భయం వెంటాడుతోంది.. ఎక్స్ రే కోసం వచ్చి కుప్పకూలిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రజలను కరోనా భయం తీవ్రంగా వెంటాడుతోంది. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎక్స్ రే తీయించుకోవడానికి వచ్చిన మహిళ ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే, ఆ మహిళకు కరోనా సోకిందేమోనని చుట్టు పక్కల వారు దగ్గరికి రాలేదు. దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె ప్రాణాలు కోల్పోయింది.

మహిళ కిందపడిపోయిన సమయంలో ఎవరైనా త్వరగా స్పందించి ఉంటే ప్రాణాలతో ఉండేది కావచ్చునని వైద్యులు చెబుతున్నారు. మాయదారి కరోనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి సాయం అందించేందుకు కూడా ఎవరినీ దగ్గరకు రానివ్వకుండా చేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Next Story

Most Viewed