చాక్‌పీస్ తినొద్దన్నాడని.. భార్య సూసైడ్!

by  |
చాక్‌పీస్ తినొద్దన్నాడని.. భార్య సూసైడ్!
X

దిశ, వెబ్‌డెస్క్ : నేటి సమాజంలో చిన్నచిన్న విషయాలకే ఓవర్ రియాక్ట్ అయి చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కట్టుకున్న భర్త చాక్‌పీస్ తినొద్దన్నాడని భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని జీడిమెట్ల కుత్బుల్లాపూర్‌లో మంగళవారం వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. అయోధ్యనగర్‌లో నివాసముంటున్న సంజూ యాదవ్ (21)కు చాక్‌పీస్ తినే అలవాటు ఉంది. రోజువారీగా చాక్‌పీసులు తింటున్న భార్య సంజూను భర్త మందలించాడు. ఎన్నిమార్లు చెప్పినా ఆమె ప్రవర్తన తీరు మారలేదు. ఈ విషయపై దంపతులిద్దరీ మధ్య తాజాగా వాగ్వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన భార్య ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story