ఎమ్మార్వో ఆఫీస్‌కు తాళం వేసి.. మహిళ హల్‌చల్

by  |
women protest
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: తమ భూమిని ఇతరుల పేరున రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ గద్వాల జిల్లా మల్లకల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం హల్ చల్ చేసింది. ఉదయం కార్యాలయానికి వచ్చి, గేటుకు తాళం వేసింది. అనంతరం చేతిలో పురుగుల మందు డబ్బా పట్టుకొని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. చివరకు ఆమె గేటు తాళం తీసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed