- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో బుధవారం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన బ్యాగులో చనిపోయిన వ్యక్తి ‘పుర్రె’ను తీసుకొచ్చింది. సరిగ్గా ఢిల్లీ విమానం ఎక్కబోతున్న సమయంలో అధికారులు ఆమెను ఆపి బ్యాగు తనిఖీ చేయగా.. అందులో నుంచి పుర్రె లభ్యమైంది. ఉజ్జయినికి చెందిన సాధ్వీ యోగ మాతగా ప్రయాణికురాలిని గుర్తించారు పోలీసులు. దీనిపై ప్రశ్నించగా.. చనిపోయిన తన గురువు ‘పుర్రె’ను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ తీసుకెళ్తున్నట్టు సమాధానం ఇచ్చింది యోగమాత.. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుని, పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఎయిర్ పోర్టులో కొంత గందరగోళం నెలకొంది.
Next Story