షాకింగ్ : బ్యాగులో ‘పుర్రె’ తీసుకొచ్చిన మహిళా ప్యాసింజర్.. విమానం ఎక్కబోతుండగా..!

by  |
షాకింగ్ : బ్యాగులో ‘పుర్రె’ తీసుకొచ్చిన మహిళా ప్యాసింజర్.. విమానం ఎక్కబోతుండగా..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో బుధవారం ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తన బ్యాగులో చనిపోయిన వ్యక్తి ‘పుర్రె’ను తీసుకొచ్చింది. సరిగ్గా ఢిల్లీ విమానం ఎక్కబోతున్న సమయంలో అధికారులు ఆమెను ఆపి బ్యాగు తనిఖీ చేయగా.. అందులో నుంచి పుర్రె లభ్యమైంది. ఉజ్జయినికి చెందిన సాధ్వీ యోగ మాతగా ప్రయాణికురాలిని గుర్తించారు పోలీసులు. దీనిపై ప్రశ్నించగా.. చనిపోయిన తన గురువు ‘పుర్రె’ను గంగా నదిలో కలిపేందుకు హరిద్వార్ తీసుకెళ్తున్నట్టు సమాధానం ఇచ్చింది యోగమాత.. దీంతో అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుని, పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఎయిర్ పోర్టులో కొంత గందరగోళం నెలకొంది.


Next Story

Most Viewed