భర్తను హతమార్చి.. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్య!

by  |
భర్తను హతమార్చి.. ప్రియుడి చేతిలో ప్రియురాలు దారుణహత్య!
X

దిశ, జుక్కల్ : భర్తను హతమార్చి ప్రియుడితో ఇన్నిరోజులు జీవితం పంచుకున్న ప్రియురాలు చివరకు అతని చేతిలోనే దారుణహత్యకు గురైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం హజ్గుల్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకివచ్చింది.

వివరాల్లోకివెళితే.. హజ్గుల్ చెందిన గంగామని అనే మహిళను ఆమె తల్లిదండ్రులు గాంధారి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.కొంతకాలం బాగానే సాగిన వీరి దాంపత్య జీవితంలో అనుకోకుండా గొడవలు తలెత్తాయి.ఈ క్రమంలోనే గంగామని తన భర్తను హతమార్చి తల్లిగారి ఇంటికి వచ్చి ఐదేళ్లుగా నివాసముంటోంది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన బాలబోయి అనే వ్యక్తితో గంగామని కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. మంగళవారం సాయంత్రం ప్రియుడు బాలబోయి కాల్ చేసి నీతో మాట్లాడాలని ఊరి బయట ఉన్న మంజీరా నది ప్రాంతానికి రావాలని చెప్పగా.. తననే ఇంటికి రమ్మని ఆమె ప్రియుడికి తెలిపింది.

అతను ఎంతకూ వినకపోయే సరికి గంగామని మంజీరవాగు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఇద్దరికి వాగ్వి వాదం చెలరేగడంతో ప్రియురాలి తల మీద ప్రియుేడు బండరాయితో బలంగా మోదాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. రాత్రయినా గంగామని ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు చేరుకున్న ఖాకీలు బాధితురాలని వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న గంగామని రాత్రి 11గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, ఘటనా స్థలిని బాన్సువాడ DSP జైపాల్ రెడ్డి, సీఐ సాజిద్, ఎస్ఐ సాయన్న పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story

Most Viewed