ఆటో బోల్తా పడి మహిళ మృతి

by  |
ఆటో బోల్తా పడి మహిళ మృతి
X

దిశ, స్టేషన్ ఘన్‎పూర్: ఆటో బోల్తా పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగాల ఘన్‎పూర్ మండలం నెల్లుట్ల ప్రధాన రహదారిపై కూలీలతో వెళ్తున్న అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలు తమ్మడపల్లి గ్రామానికి చెందిన బాదం కిష్టమ్మగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



Next Story

Most Viewed