బ్రిడ్జిపై నుంచి దూకి.. మహిళ ఆత్మహత్య

by  |
బ్రిడ్జిపై నుంచి దూకి.. మహిళ ఆత్మహత్య
X

దిశ, మెదక్ : బ్రిడ్జిపై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ సమీపంలోని శివంపేట వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. శివంపేట గ్రామానికి చెందిన సల్మాబేగం అనే వివాహిత కుటుంబ తగాదాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు వెల్లడించారు. మృతురాలికి 5ఏండ్ల బాబుతో పాటు, 8నెలల బాబు కూడా ఉన్నట్టు సమాచారం. భర్త ఖాజా మొయినుద్దీన్ చికెన్ సెంటర్ వ్యాపారి. కాగా, వివాహిత మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags : women sucide, medak, jump from building, sangarredy

Next Story