పిడుగు పాటుతో మ‌హిళ మృతి

by  |
పిడుగు పాటుతో మ‌హిళ మృతి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో దారుణం జరిగింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పిన‌పాక మండ‌లం బోటిగూడెంలో పిడుగు పాటుతో ఓ మ‌హిళ మృతి చెందింది. ఇదే ఘ‌ట‌నలో మ‌రో మ‌హిళ కూడా గాయ‌ప‌డగా, ప్రస్తుతం ఆమె పరిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం గ్రామంలో నాట్లు వేస్తుండ‌గా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తేలింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed