బట్టలు ఆరబెడుతుండగా.. కరెంట్ షాక్‌ తగిలి!

by  |
బట్టలు ఆరబెడుతుండగా.. కరెంట్ షాక్‌ తగిలి!
X

దిశ, నర్సంపేట : వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం జరిగింది. బట్టలు ఆరబెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. మనుబోతుల మమత(29) అనే మహిళ ఇంటి వద్ద బట్టలు ఆరబెడుతోంది. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు ఆ తీగకు పవర్ సరఫరా కావడంతో ఆమె సృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతిచెందినట్లు తెలపడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed