కడపలో ఆటోబోల్తా.. ఒకరు మృతి

by  |
కడపలో ఆటోబోల్తా.. ఒకరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లాలోని పులివెందుల ముద్దనూరులో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.

గాయపడిన పడిన వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరాతీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed