ములుగులో విషాదం.. మహిళ ప్రాణం తీసిన ‘మత్తు’

by  |
ములుగులో విషాదం.. మహిళ ప్రాణం తీసిన ‘మత్తు’
X

దిశ, ములుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలోని ములుగులో తీవ్ర విషాదం నెలకొంది. మద్యం మత్తులో నీటి కుంటలో పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన ములుగు మండలం బహిలింపూర్ గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. మండల ఎస్సై రంగ కృష్ణ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లె ఎల్లమ్మ (50) గ్రామంలో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించేది. ఈమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, భర్త ఉన్నారు. ఎల్లమ్మకు ప్రతీరోజూ మద్యం సేవించే అలవాటు ఉందని తెలుస్తోంది.

శుక్రవారం దసరా సందర్భంగా భార్యభర్తలు మద్యం సేవించారు. అయితే, ఎల్లమ్మ తాగిన అనంతరం బంధువులకు జమ్మి పెట్టి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోయేసరికి కుటుంబీకులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంటి వద్దే ఉన్న నీటి కుంటలో ఆదివారం ఉదయం ఎల్లమ్మ మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెంది ఉంటుందని కొడుకు పల్లె మహేష్ చెప్పినట్టు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై తనకు ఎవరిమీద అనుమానాలు లేవని కొడుకు మహేష్ తెలిపినట్టు ఎస్సై వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రంగ కృష్ణ తెలిపారు.



Next Story

Most Viewed