- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని సారంగపూర్ ఏఎస్ఐ లక్ష్మీనారాయణ పై చర్యలు తీసుకోవాలని బుధవారం మండలంలోని కొనాపూర్ గ్రామానికి చెందిన ఆర్నకొండ లక్ష్మీ అనే మహిళ జిల్లా ఎస్పీ సింధుశర్మకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న తనపై ఈ నెల 15న మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి చేయి వేసి అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన వారిపై అదే రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, న్యాయం చేయాల్సింది పోయి వారు ఫిర్యాదును పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది.
దీంతో మరోసారి పోలీస్స్టేషన్కు వెళ్లి నిందితుని వర్గీయులతో తనకు ప్రాణభయం ఉందని.. న్యాయం చేయాలని ప్రాధేయపడగా ఏఎస్ఐ తనతో అసభ్యంగా మాట్లాడుతూ అవమానించాడని.. ఎస్సై కిరణ్ కుమార్ కూడా తాను చేసేదేమిలేదని చెప్పినట్లు ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నది. తనను అవమానించడంతో పాటు నిందితులను కూడా వదిలిపెట్టి కేసును నిర్వీర్యం చేశారని ఆరోపిస్తూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని ఫిర్యాదులో లక్ష్మీ కోరారు. నీపై ఎలా చేయి వేశాడు, ఆధారాలు ఉన్నాయా? అని దురుసుగా వ్యవహరించిన ఏఎస్ఐ లక్ష్మీనారాయణ పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు కోరారు.