టీఆర్ఎస్ నేతనంటూ చీటింగ్.. చివరకు చెప్పుతో కొట్టిన మహిళ..

by  |
టీఆర్ఎస్ నేతనంటూ చీటింగ్.. చివరకు చెప్పుతో కొట్టిన మహిళ..
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో డబ్బుల విషయంలో తనను చీట్ చేసిన వ్యక్తికి ఓ మహిళ బుద్ది చెప్పింది. బాలానగర్ కార్పొరేటర్ ఆఫీసు ఎదుట చెప్పుతో కొట్టింది. వివరాల ప్రకారం.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని అంటూ.. ఓ మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని చెప్పి.. ఆమె దగ్గర రూ. 10లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇళ్లు ఇప్పించకపోవడంతో మహిళ అతడిని డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది.

దీంతో, సదరు వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా.. ఆమెను వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఇక వేధింపులు భరించలేక ఆ మహిళ.. ఈరోజు బాలానగర్ కార్పొరేటర్ ఆఫీస్ వద్ద చీటర్‌ను అందరి ముందే చెప్పుతో కొట్టి.. అతడి మోసాన్ని బయటపెట్టింది.


Next Story

Most Viewed