- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లో డబ్బుల విషయంలో తనను చీట్ చేసిన వ్యక్తికి ఓ మహిళ బుద్ది చెప్పింది. బాలానగర్ కార్పొరేటర్ ఆఫీసు ఎదుట చెప్పుతో కొట్టింది. వివరాల ప్రకారం.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తిని అంటూ.. ఓ మహిళకు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని చెప్పి.. ఆమె దగ్గర రూ. 10లక్షలు వసూలు చేశాడు. ఇప్పటికీ ఇళ్లు ఇప్పించకపోవడంతో మహిళ అతడిని డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరింది.
దీంతో, సదరు వ్యక్తి డబ్బులు ఇవ్వకపోగా.. ఆమెను వేధింపులకు గురిచేసినట్టు సమాచారం. ఇక వేధింపులు భరించలేక ఆ మహిళ.. ఈరోజు బాలానగర్ కార్పొరేటర్ ఆఫీస్ వద్ద చీటర్ను అందరి ముందే చెప్పుతో కొట్టి.. అతడి మోసాన్ని బయటపెట్టింది.
Next Story