కుటుంబ కలహాలు.. కెనాల్‌లో దూకిన మహిళ

by  |
కుటుంబ కలహాలు.. కెనాల్‌లో దూకిన మహిళ
X

దిశ,పాలకుర్తి: తొర్రూరు మండలం అమర్ సింగ్ తండాకు చెందిన మహిళా ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో దూకి గల్లంతైంది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం… మండలంలోని అమర్‌సింగ్ తండాకు చెందిన భూక్య హరిలాల్ రంగమ్మల కూతురు సునీత (32)ను అందే తండాకు చెందిన ఆపావత్ శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సునీత అరిపిరాల శివారు కోటిలింగాల వద్ద కెనాల్ కాలువలో దూకింది. ఈ మేరకు స్థానికులు కాలువలో దిగి గాలించగా ఎంతకీ ఆచూకీ దొరకలేదు.

Next Story

Most Viewed