ఇంటి గోడను ఢీకొన్న లారీ.. మహిళ మృతి

by  |
ఇంటి గోడను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. నగరంలో మద్దిలపాలెం గాయత్రి స్కూల్ దగ్గర ఇంటి ప్రహరీ గోడని లారీ వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇంటి గోడ పడిపోవడంతో ఇంట్లో ఉన్న బోణి రమణమ్మ (45) అనే వివాహిత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed