లంచంగా ‘తాళి’.. MRO ఆఫీసు గుమ్మానికి మంగళ సూత్రం కట్టిన మహిళ

by  |
siricilla
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రుదంగ్రి తహసీల్దార్ ఆఫీస్ ముందు మహిళ ఆందోళనకు దిగారు. ఆఫీస్ మెయిన్ డోర్‌కు తన తాళి వేలాడి దీసి మహిళా రైతు మంగ నిరనస వ్యక్తం చేశారు. తన భూమి (సర్వే నెంబర్ 130/14 లో ఉన్న 2 ఎకరాలు) వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని మంగ అధికారులపై ఫైర్ అయ్యారు. తన ‘మంగళసూత్రాన్ని’ లంచంగా తీసుకుని.. తన భూమిని ఇప్పించాలని మంగ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా మంగ మాట్లాడుతూ.. మూడేళ్లుగా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగ భర్త రాజేశం చనిపోయాక వారి భూమిని వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని ఆమె ఆరోపించారు. అడిగితే వేరే వాళ్ల పేరుతో భూమి ఫైల్ అయిపోందని రెవెన్యూ సిబ్బంది చెబుతున్నారని మంగ ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed