షాకింగ్.. అర్ధరాత్రి భర్తను కొట్టి.. భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి..

by  |
Rape
X

దిశ, వెబ్‌డెస్క్ : బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకొని.. భర్తను కొట్టి భార్యను పొలాల్లోకి లాక్కెళ్లి కొందరు దుండగులు ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జిల్లాలోని మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై గుర్తు తెలియని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బుధవారం రాత్రి పాలడుగు అడ్డరోడ్‌లో బైక్‌పై వెళ్తున్న దంపతులను అడ్డుకున్న దుండగులు.. భర్తను కొట్టి మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే.. బాధితులు బుధవారం రాత్రి సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా.. తమ పరిధి కాదని పోలీసులు ఫిర్యాదు తీసుకోడానికి నిరాకరించినట్టు సమాచారం.


Next Story

Most Viewed