మహిళపై అత్యాచారం.. హత్య

by  |
మహిళపై అత్యాచారం.. హత్య
X

దిశ, వెబ్‎డెస్క్:
మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఆడవారిపై ఆఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురంలో ఓ మహిళపై కొందరు దుండుగులు అత్యాచారం చేసి హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు బుధవారం రాత్రి మియాపూర్ నుంచి కొల్లూరు తండాకు తీసుకువచ్చారు. మహిళపై లైంగికంగా దాడి చేసిన అనంతరం చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మధు, నందు యాదవ్, కుటుంబరావు అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Next Story