- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఎల్బీనగర్: పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. చున్నీతో ఉరేసి ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి జిల్లా ముటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన సొప్పరి సాయిలు పెద్ద కూతురు హేమలత గత రెండేళ్ల క్రితం నగరానికి వచ్చి కూకట్పల్లిలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండేది. కరోనా కారణంగా గత నాలుగు నెలల నుంచి హేమలత ఎల్బీనగర్ పరిధిలోని జనప్రియ కాలనీలో ఫ్యామిలీ కేర్ సర్వీసు సెంటర్లో పనిచేస్తుంది. అదే సెంటర్లో ఏపీలోని కృష్ణా జిల్లాలకు చెందిన వెంకటేశ్వరరావు కూడా పనిచేస్తున్నాడు. శనివారం ఒంటరిగా ఉన్న హేమలతపై వెంకటేశ్వరరావు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో దాడి చేసి చున్నీతో ఉరేసి హత్య చేశాడు. కేర్ సెంటర్ యజమాని ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.