- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జడ్చర్ల: పాము కాటుకు గురై మహిళ మృతి చెందిన సంఘటన మంగళవారం మిడ్జిల్ మండలంలో వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోయిన్పల్లి గ్రామానికి చెందిన కేశవ పార్వతమ్మ (40) తన వ్యవసాయ పొలంలో పని చేసుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పాము కాటేసింది. ఆ తర్వాత పార్వతమ్మ నడుచుకుంటూ ఇంటికి వెళ్లి పాముకాటుకు గురైన విషయం తమ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై 108 అంబులెన్స్కు సమాచారం అందించగా అంబులెన్స్ అందుబాటులో లేదు. మహబూబ్నగర్లో ఉన్నామని.. రావడానికి ఆలస్యం అవుతుంది అని సమాధానం చెప్పడంతో ప్రయివేట్ వాహనంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల ప్రాంతంలో పార్వతమ్మ మృతి చెందినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా 108 అంబులెన్స్ రాకపోవడం, ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యం జరిగిందని, దీనికితోడు పార్వతమ్మకు ఆసుపత్రిలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
- Tags
- midjil