కుమ్మర్ల బోనాల పండుగలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

by Taduka Kalyani |

ఆషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్ ఆర్ఎస్ ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు.

కుమ్మర్ల  బోనాల  పండుగలో పాల్గొన్న డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి : ఆషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు మొదలయ్యాయి. ఆనవాయితీగా ఎఫ్ ఆర్ఎస్ ఎల్లమ్మ తల్లికి కుమ్మర్లు తొలి బోనం సమర్పించారు. ఐబి నుంచి మొదలుకుని ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈ బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆషాడ మాసం అత్యంత పవిత్రమైన మాసం అన్నారు. ఆశాడ మాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారం అన్నారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్ లు శైలేష్ రెడ్డి, కృష్ణ, అశ్విన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం, కుమ్మరి సంఘం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.

Next Story