- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, జవహర్ నగర్: మేడ్చల్ లో విషాదం చోటుచేసుకొంది. పండగ కని పుట్టింటికి వచ్చిన వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకొని మొదటిసారి తల్లి దగ్గరికి వచ్చిన ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలలోకి వెళితే.. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 17వ డివిజన్ కు చెందిన దివ్య (21) అనే యువతి, రోహిత్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అయితే పెళ్లైన తర్వాత వచ్చిన వినాయక చవితి పండగ కావడంతో ఐదు రోజుల క్రితం భర్త రోహిత్ తో కలిసి తన తల్లి ఇంటికి వచ్చింది.
అందరు పండగ బాగా జరుపుకొని సంతోషంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తెల్లవారుజామున దివ్య అనుమానాస్పదంగా మృతిచెందింది. దీంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దివ్య మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సహజంగానే దివ్య మృతిచెందిదా..? లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.