‘వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే నా భార్య చనిపోయింది’

by  |
Woman dead
X

దిశ, ములుగు: ములుగు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని క్రాస్‌రోడ్‌లో మహిళ మృతి కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ముక్కెర శోభ(55) ఈనెల 22న స్థానిక పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంది. దీంతో ఆమెకు శుక్రవారం జ్వరం వచ్చి, ఒళ్లంతా నొప్పులుగా ఉందని తీవ్ర అస్వస్థతకు గురైంది. ముందుగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం వరంగల్ ఎంజీఎం తరలించారు. శుక్రవారం రాత్రి పరిస్థితి విషమించి ఆమె మృతిచెందింది. దీంతో వ్యాక్సిన్ వేసుకోవడం మూలంగానే నా భార్య చనిపోయిందని మృతురాలి భర్త చేరాలు ఆరోపించారు. వ్యాక్సినేషన్ తొందరగా పూర్తి చేయాలనే ఆలోచన మంచిదే అయినా, ఈ తొందరపాటులో ఎలాంటి ఆరోగ్య పరీక్షలు చేయకుండానే వ్యాక్సిన్ వేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చే వారికి తప్పనిసరిగా టెస్టులు చేయాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే వ్యాక్సిన్ వేయాలని అంటున్నారు.


Next Story

Most Viewed