గడ్డి కోయడానికి వెళ్లిన మహిళ.. అంతలోనే కాటేసిన కరెంట్

by  |
గడ్డి కోయడానికి వెళ్లిన మహిళ.. అంతలోనే కాటేసిన కరెంట్
X

దిశ బెజ్జూర్ : విద్యుత్ ఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన కొమురం భీం జిల్లా దహెగం మండలంలో బుధవారం జరిగింది . గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా‌లోని దహేగావ్ మండలం కేంద్రానికి చెందిన తుమ్మిడి కళావతి 30 సంవత్సరాలు అనే వివాహిత బుధవారం ఉదయం పశువుల మేత కోసం చేనులో గడ్డి కోసే ఈ క్రమంలో విద్యుత్ వైర్లు కొడవలితో కోసి వేయడంతో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతురాలి భర్త నారాయణ తెలిపారు .మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.



Next Story

Most Viewed