కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం..

by  |
కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం..
X

దిశ, వెబ్‌డెస్క్ : కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వివరాల ప్రకారం.. కరోనా సోకిన ఓ మహిళ సదరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నది. చికిత్సలో భాగంగా ఆమెకు డాక్టర్లు.. ‘ఓ’ బ్లడ్ గ్రూప్ ప్లాస్మాకు బదులు మరో బ్లడ్ గ్రూప్ ప్లాస్మా ఎక్కించారు.

దీంతో ఆమె ఈరోజు మృతి చెందింది. అంతేకాకుండా.. ఆసుపత్రి యాజమాన్యం ఆ మహిళ వద్ద 8 రోజులకే రూ. 19.45 లక్షల బిల్లు వేశారు. అయితే.. అసలు విషయం బయటపడటంతో ఆసుపత్రి యాజమాన్యం బిల్లు కట్టాల్సిన అవనరంలేదని చెబుతూ.. డెడ్ బాడీని ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలంటూ బంధువులపై ఒత్తిడి చేశారు. మహిళ బంధువులు మీడియాను ఆశ్రయించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి.

Next Story

Most Viewed