ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ.. చెరువులో అలా

by  |
ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ.. చెరువులో అలా
X

దిశ, ( లోకేశ్వరం) : ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన లోకేశ్వరం మండలంలో జరిగింది. లోకేశ్వరం ఎస్ఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హావర్గా గ్రామానికి చెందిన పవర్ శాంతాబాయి శనివారం ఉదయం నుంచి కనిపించడం లేదని తానూర్ మండలం లోని హిప్ నెల్లి తండాకు చెందిన ఆమె తండ్రి రాథోడ్ దేవిదాస్ లోకేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆదివారం వర్గ సమీపంలోని చెరువులో మృతదేహాన్ని కనుగొన్నట్లు ఆయన తెలిపారు. ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని విచారణ చేపట్టి మృతికి గల కారణాలు తెలియజేస్తామని తెలిపారు.



Next Story