వైద్యుల నిర్లక్ష్యం‌తో మహిళ మృతి

by  |
వైద్యుల నిర్లక్ష్యం‌తో మహిళ మృతి
X

దిశ, బెజ్జుర్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఒక ప్రవేటు ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతిచెందడంతో కుటుంబీకులు శుక్రవారం శవంతో ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. కాగజ్‌నగర్ పట్టణంలోని ఓ ప్రవేటు హాస్పిటల్‌లో బట్టు పల్లి గ్రామానికి చెందిన రెహనా సుల్తానా రెండో డెలివరీ కోసం జ్యోతి ఆస్పత్రిలో బుధవారం ఉదయం చేరింది. డెలివరీ‌లో పాపకు జన్మనిచ్చింది. అనంతరం సాయంత్రం 5 గంటల వరకు పడుకొని నిద్ర లేవకపోవడం‌తో కుటుంబీకులు డాక్టర్‌ను సంప్రదించగా ఫిట్స్ వచ్చిందని, వెంటనే మంచిర్యాల ఆస్పత్రికి తరలించాలని చెప్పడంతో కుటుంబీకులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించే క్రమంలోనే రెహనా(33) సంవత్సరాలు మృతిచెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం హాస్పిటల్ ముందు శవంతో కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని హాస్పిటల్‌లో సీజ్ చేయాలని, జిల్లా అధికారులు వచ్చే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Next Story

Most Viewed