- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సిద్దిపేట: ఆర్టీసీ బస్సులో మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్ నుండి ఆసిఫాబాద్ (ఆసిఫాబాద్ డిపో) వెళ్తున్న బస్సు సరిగ్గా సిద్దిపేటలోని వేములవాడ కమాన్ వద్దకు రాగానే జయంతి అనే మహిళ (30 సంవత్సరాలు)కు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. వెంటనే తోటి ప్రయాణికులు గమనించి 108 కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన 108 EMT కిషన్, 108 బైక్ ఫస్ట్ రెస్పాండర్ నవీన్ కుమార్, పైలట్ కనకరాజులు అక్కడికి చేరుకున్నారు. పేషెంట్ పరిస్థితిని చూసి ఆర్టీసీ బస్సులోనే కాన్పు చేశారు. ఆర్టీసి బస్లో జయంతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇద్దరినీ సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. వైద్యులు పరీక్షించి ప్రస్తుతం తల్లీ-బిడ్డా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.
- Tags
- Delivery
Next Story