పై నుంచి దూసికెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి

by  |
పై నుంచి దూసికెళ్లిన ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున ఓ ఆర్టీసీ బస్సు మహిళా కూలీ ప్రాణాలు బలిగొన్నది. ఈ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బొంపల్లి గ్రామంలో ఓ మహిళా కూలీపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళా అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా, ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

మహిళా కూలీ మృతిచెందడంతో ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజాగ్రత్తగా బస్సు నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed