- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం తెల్లవారుజామున ఓ ఆర్టీసీ బస్సు మహిళా కూలీ ప్రాణాలు బలిగొన్నది. ఈ ప్రమాద సమయంలో అక్కడే ఉన్న స్థానికులు కంటతడి పెట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బొంపల్లి గ్రామంలో ఓ మహిళా కూలీపై నుంచి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళా అక్కడికక్కడే మృతిచెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా, ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
మహిళా కూలీ మృతిచెందడంతో ఆ గ్రామంలో రోదనలు మిన్నంటాయి. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజాగ్రత్తగా బస్సు నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story