- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మణుగూరు: కుండపోతగా కురిసిన వర్షానికి మండలంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. నిత్యావసరాలు, వైద్యం కోసం గిరిజనులు వాగులు దాటక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగులు దాటుతున్నారు. గుండాల-నరసాపురం మధ్య మల్లన్న వాగుపై నిర్మించిన తాత్కాలిక వంతెన వరద ఉధృతికి కొట్టుకుపోయింది.
దీంతో నరసాపురం తండాకు చెందిన మాలోతు మౌనిక తన 45 రోజుల పాపకు టీకా వేయించేందుకు, స్థానికుల సాయంతో వాగు దాటి టీకా వేయించింది. ప్రమాదమని తెలిసినా.. అత్యవసర పరిస్థితులలో వాగు దాటడం తప్పడం లేదని గిరిజనులు వాపోతున్నారు. మా బతుకులు ఎప్పుడు మారతాయో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు మరల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story