కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్‌ పైనుంచి దూకిన మహిళ

by  |
కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్‌ పైనుంచి దూకిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేరెడ్‌మెట్‌ అంబేద్కర్‌నగర్‌లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోగా ఆ విషయాన్ని బంధువులు అతని భార్య ధనలక్ష్మికి చెప్పారు. ఇదేక్రమంలో భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని మహిళ వెంటనే బిల్డింగ్‌పై నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దంపతులు ఒకరోజులోనే చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story