విషాదం.. బావిలో దూకి మహిళ ఆత్మహత్య

by  |
విషాదం.. బావిలో దూకి మహిళ ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రోజున వెంకటాపురం గ్రామానికి చెందిన మంటిపల్లీ మంగమ్మ (33) గ్రామ శివారులో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియ రాలేదు. కాగ మంగమ్మ భర్త మల్లేష్ ఇటీవల జరిగిన ఓ కారు ప్రమాదంలో మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed