కోడలు పట్టించుకోవడం లేదంటూ.. అత్త చేసిన పనికి అందరూ షాక్

by  |
sakku bai
X

దిశ, పరిగి: అనారోగ్య సమస్యకు తోడు కోడలు పట్టించుకోవడం లేదంటూ ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. బాధిత మహిళ, స్థానికులు తెలిపిన వివరాల.. ప్రకారం పరిగి తుంకులగడ్డకు చెందిన సక్కుబాయి (55)కి ముగ్గురు కొడుకులు, ఒక కూతరు ఉంది. సక్కుబాయికి గర్భ సంచి తొలగించినప్పటి నుండి కడుపునొప్పితో బాధపడుతుండేది. ఆమెకు కడుపు నొప్పి తీవ్రం అయింది. కాని వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక సక్కుబాయికి మెరుగైన వైద్యం అందిచలేకపోయారు. కడుపునొప్పి బాధ.. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో మనో వేదనకు గురైంది. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తుంకులగడ్డకు సమీపంలోని ఓ నీటి గుంతలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఇది గమనించిన స్థానికులు వెంటేనే నీటి గుంతలోకి దూకి ఆమెను కాపాడారు. అనంతరం సక్కుబాయిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Next Story