మనస్థాపానికి గురై.. గోదారికి చేరిన మహిళ

by  |
మనస్థాపానికి గురై.. గోదారికి చేరిన మహిళ
X

దిశ బోధన్ : కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన నవీపేటలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కొన్ని రోజుల నుంచి మహిళ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ మహిళ గోదావరి నదిలో దూకడానికి నది ఒడ్డుకు వెళ్లింది. దీంతో సమాచారం అందుకున్న బాసర పోలీసులు వెంటనే గోదావరి వద్దకు చేరుకొని మహిళను కాపాడారు. అనతరం బాసర ఎస్సై, బాలాజీ పేట్రోలింగ్ సిబ్బంది హోంగార్డు శివరాజ్ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి తన కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Next Story