క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన రోహిణి.. అంతలోనే !

by  |
క్షణికావేశంలో ఇంట్లో నుంచి వెళ్లిన రోహిణి.. అంతలోనే !
X

దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోహిణి (20) అనే మహిళ.. 18నెలల కొడుకు అవినాశ్‌తో బయటకు వెళ్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. వికారాబాద్ మండలం అత్వేల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం భర్తతో గొడవపడిన రోహిణి.. కొడుకుతో సహా బయటకు వచ్చి.. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా రోహిణి దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed