అక్కడ 24గంటల్లో 88మంది పోలీసులకు కరోనా

by  |
అక్కడ 24గంటల్లో 88మంది పోలీసులకు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్ర రూపం దాలుస్తోంది. భారత్‌లో ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఇప్పటికే మొదటి స్థానంలో నిలిచింది. ఇన్నిరోజులు సాధారణ ప్రజలను వెంటాడిన కరోనా ప్రస్తుతం మహా పోలీసులను భయాందోళనకు గురిచేస్తున్నది. గడచిన 24గంటల్లో అక్కడ 88మంది పోలీసులకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా, ఆదివారం చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 47మంది పోలీసులు మహమ్మారి బారిన పడి మృతి చెందగా, మొత్తంగా 4,048మంది పోలీసు సిబ్బంది కరోనా సోకి చికిత్స పొందుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed