మందుబాబులకు కష్టాలు… ఇవాళ్టి నుండి వైన్స్ బంద్

by  |
మందుబాబులకు కష్టాలు… ఇవాళ్టి నుండి వైన్స్ బంద్
X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో మందు బాబులకు నేటి నుండి ఇక్కట్లు ప్రారంభం కానున్నాయి. హోలీ సందర్భంగా అందరికీ రంగులు కనిపిస్తే… వాళ్లకు మాత్రం చుక్క దొరక్క చుక్కలు కనిపించనున్నాయి. హోలీ సందర్భంగా ఈ నెల 28, 29, 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. కాగా ఈ ఆదేశాలు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి అమలుకానున్నాయి. కరోనా నేపథ్యంలో హోలీ సందర్భంగా రోడ్లపై రంగులు చల్లడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు.

Next Story