మందుబాబులకు షాక్.. మరో 3 రోజులు వైన్స్ బంద్

by  |
మందుబాబులకు షాక్.. మరో 3 రోజులు వైన్స్ బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లోని మందుబాబులకు షాక్. హోలీ సందర్భంగా ఈ నెల 28,29, 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. 28వ తేదీ సాయంత్రం 4 గంటల నుండి, 29, 30వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.

కరోనా నేపథ్యంలో హోలీ సందర్భంగా రోడ్లపై రంగులు చల్లడం, గుంపులు గుంపులుగా తిరగడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటించాలని కోరారు.



Next Story

Most Viewed