ప్రభుత్వం చెప్పిన వినని వైన్స్ షాప్ యజమానులు..

by  |
wines
X

దిశ, కొండపాక: ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా వైన్స్‌ల యజమానులు ఇష్టారాజ్యంగా మద్యం దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. మామళ్లకు అలవాటు పడి ఎక్సైజ్ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కొండపాక మండలం కుకునూరుపల్లి గ్రామంలో నూతన మద్యం పాలసీ‌లో భాగంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు రాజీవ్ రహదారికి అతి సమీపంలో ఉన్నాయి. రహదారులకు కనీస దూరంలో వైన్స్ లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిబంధనను కూడా పాటించకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.


Next Story

Most Viewed