- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వనపర్తి : జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు పాత్ర పోషిస్తానని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రాంతీయ సదస్సుకు మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో తెలంగాణ యాస, సంసృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై తనకు పూర్తిస్థాయి అవగాహన ఉందని ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నాగనూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ, యూనియన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story