సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటా: అన్నా రాంబాబు

by  |
సీఎంను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటా: అన్నా రాంబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: ఒంగోలులో వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరుల దాడిని గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. సుబ్బారావు ఇతర సామాజిక వర్గమైతే సుభానీ కొట్టేవారా? అని ప్రశ్నించారు. త్వరలోనే తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానని చెప్పుకొచ్చారు.

గిద్దలూరు రాజకీయ పరిస్థితులపై సీఎంను కలిసి వివరిస్తానని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన వ్యాఖ్యలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్​గా మారాయి.


Next Story

Most Viewed