- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: చర్చలకు ద్వారాలు తెరిచే ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తామూ చర్చలకూ సిద్ధంగానే ఉన్నామని రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ట్రాక్టర్ ర్యాలీ తర్వాత ప్రభుత్వం అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని ముందుగా కల్పించాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఒత్తిళ్లకు తాము తలొగ్గమని చెప్పారు. ప్రధానమంత్రి ప్రతిష్టను కాపాడుతామని, గౌరవిస్తామని, అదే సమయంలో రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి కట్టుబడతామని తెలిపారు. ట్రాక్టర్ పరేడ్లో జరిగిన హింసాత్మక ఘర్షణలు కుట్రలో భాగంగానే చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఎర్రకోటపై సిక్కుల జెండాను ఎగరేయడాన్ని ఖండించారు. జాతీయ జెండాను అందరూ ప్రేమిస్తారని, గౌరవిస్తారని అన్నారు. జాతీయ జెండాను అవమానించడాన్ని ఎప్పటికీ అంగీకరించబోమని స్పష్టం చేశారు. అందుకే లాల్ ఖిల్లాపై సిక్కుల జెండా ఎగరేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు.