అందరికీ ఉచితంగా కరోనా టీకా -పళనిస్వామి

by  |
అందరికీ ఉచితంగా కరోనా టీకా -పళనిస్వామి
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనా టీకా విజయవంతమై విస్తృత ఉత్పత్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా వేయిస్తామని తమిళనాడు సీఎం పళనిస్వామి హామీనిచ్చారు. బిహార్‌ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఉచిత టీకా హామీని ప్రకటించిన గంటల వ్యవధిలోనే తమిళనాడు సర్కారు ఈ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. కరోనా కట్టడి చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన తర్వాత సీఎం ఈ ప్రకటన చేశారు. జిల్లాలో ప్రభుత్వదంత బోధనాస్పత్రిని ప్రారంభిస్తామని ప్రకటించారు.

Next Story