సాహెబ్ చెరువును సుందరీకరించాలి

by  |
సాహెబ్ చెరువును సుందరీకరించాలి
X

దిశ, ఎల్బీనగర్ : నియోజకవర్గం పరిధిలోని సాహెబ్ నగర్ బతుకమ్మ చెరువును అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు సామ రంగారెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలెక్టర్ అమోయ్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ చెరువులోని చెత్తను తొలగించాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో ఆకుల రమేశ్‌గౌడ్, కళ్ళెం రవీందర్ రెడ్డి, వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, కొత్త రవీందర్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story