అలా చేస్తున్నాడని.. భర్తను అమ్మేసిన భార్య..!

by  |
అలా చేస్తున్నాడని.. భర్తను అమ్మేసిన భార్య..!
X

దిశ, వెబ్‌డెస్క్ : మన దేశంలో భార్య భర్తల బంధానికి చాలా విలువ ఉంటుంది. ఒక్కసారి పెళ్లి జరిగితే దంపతులు ఆ బంధానికి ఎంతో వాల్యూ ఇస్తారు. ఒకరినొకరు అమితంగా ఇష్టం పెంచుకుంటారు. అలాంటి దాంపత్య జీవితంలో తన భర్తపై ఎవరిదైనా కన్నుపడితే భార్యలు అస్సలు చూస్తూ ఊరుకోరు. వారికి తగిన బుద్ది చెబుతారు. కానీ, ఇక్కడ ఒక భార్య మాత్రం ఏకంగా తన భర్త నే పరాయి మహిళకు అమ్మేసేందుకు సిద్ధమైంది. అందుకోసం రూ. 5లక్షలకు బేరం కూడా మాట్లాడింది. ఇంతకు తను ఇలా ఎందుకు చేసిందంటే.. భర్త జల్సాలకు అలవాటు పడటమే కారణం.

ఈ ఇంట్రెస్టింగ్ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యతో సాఫీగా సంసారం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే జల్సాలకు అలవాటుపడి మరో మహిళ దగ్గర రూ.5 లక్షలు అప్పు చేశాడు. ఎంతకూ అప్పు చెల్లించకపోవడంతో సదరు మహిళ పలుమార్లు ఒత్తిడి తెచ్చింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని, కావాలంటే శారీరక సుఖం మాత్రం అందిస్తానని అతను చెప్పాడు. అందుకు ఆ మహిళ అంగీకరించింది. వీరిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. ఓ రోజు ఈ విషయం భార్యకు తెలిసింది. దీంతో ఆగ్రహం తెచ్చుకున్న ఆమె ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళకు తన భర్తను అమ్మేసేందుకు రూ.5 లక్షలకు బేరం పెట్టేసింది.


Next Story

Most Viewed