భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన

by  |
భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ప్రేమించి పెళ్లి చేసుకుని ఓ బాబు పుట్టాక ఇప్పుడు త‌న‌కు దూరంగా ఉంటున్నాడ‌ని రోదిస్తూ భ‌ర్త ఇంటి ఎదుట భార్య ఆందోళ‌న‌కు దిగింది. ఈ ఘ‌ట‌న గురువారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని శుక్ల‌వారి తోట శివాలయం ప్రాంతంలో జ‌రిగింది. వివరాళ్లోకి వెళితే.. శుక్ల‌వారి తోట శివాలయం ప్రాంతంలో ఉండే జాలాది న‌రేంద‌ర్‌కు అదే ప్రాంతంలో ఉండే కీర్తికి రెండేండ్ల క్రితం వివాహం అయ్యింది. అనంతరం వీరికి ఓ బాబు పుట్టాడు. అయితే కొంత‌కాలంగా కీర్తిని వ‌దిలేసిన న‌రేంద‌ర్ ఆమెతో క‌ల‌సి జీవించ‌లేన‌ని చెబుతూ ఆచూకీ దొర‌క్కుండా తిరుగుతున్నాడు. దీంతో కొద్ది రోజులుగా నాలుగు రోజుల క్రితం నుంచి ఆమె న‌రేంద‌ర్ ఇంటి ఎదుట మౌన‌దీక్ష‌కు కూర్చుంది. త‌న‌కు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తోంది. విష‌యం తెలుసుకున్న మ‌హిళా సంఘాలు మ‌ద్ద‌తు తెలిపాయి. కీర్తికి న్యాయం జ‌రిగే వ‌ర‌కూ పోరాటం చేస్తాన‌ని మ‌హిళా సంఘాల నాయ‌కులు అంటున్నాయి.


Next Story

Most Viewed