షాకింగ్ : మహిళ డెడ్‌ బాడీని దుప్పట్లో చుట్టి తీసుకెళ్లింది అందుకే..

by  |
షాకింగ్ : మహిళ డెడ్‌ బాడీని దుప్పట్లో చుట్టి తీసుకెళ్లింది అందుకే..
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : మ‌హిళ మృత‌దేహాన్నిదుప్ప‌ట్లో చుట్టి చెరువులో ప‌డ‌వేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ ఇద్ద‌రు యువ‌కుల‌ను స్థానికులు చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. అయితే, హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటుచేసుకున్న‌ ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఆల‌స్యంగా వెలుగుచూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన డేగ శ్రీ‌నివాస్ అనే వ్యక్తి ల‌క్ష్మీ (30)ను ప‌దేండ్ల కింద‌ట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్ద‌రు సంతానం. ఆరు నెల‌ల కిందట హ‌య‌త్‌న‌గ‌ర్‌కు వ‌ల‌సవ‌చ్చి తొర్రూరు రోడ్డులోని హ‌నుమాన్ దేవాల‌యం ప‌క్క‌వీధిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఇద్ద‌రు పిల్ల‌లు స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతున్నారు. కాగా, శ్రీ‌నివాస్‌, ల‌క్ష్మీ ఇద్ద‌రూ భ‌వ‌న నిర్మాణ కూలి ప‌నుల‌కు వెళ్తూ జీవ‌నం సాగించేవారు.

రెక్కాడితే గానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి వీరిది. ఈ క్ర‌మంలో నెల రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ల‌క్ష్మీకి స్థానిక ఆస్ప‌త్రిలో చికిత్స చేయించారు కుటుంబసభ్యులు. ఈ నెల 23వ తేదీ రాత్రి ఆరోగ్యం విష‌మించ‌డంతో ల‌క్ష్మీ మృతి చెందింది. అంతిమ సంస్కారాల‌కు చేతిలో చిల్లిగ‌వ్వ లేక‌పోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో స్నేహితుడు వినోద్‌కు స‌మాచారం ఇచ్చాడు భర్త శ్రీనివాస్. అత‌డి స‌హ‌కారంతో భార్య ల‌క్ష్మీ మృత‌దేహాన్ని దుప్ప‌ట్లో చుట్టుకుని భుజాన మోసుకెళ్తూ బాతుల చెరువు స‌మీపంలో పూడ్చిపెట్టేందుకు బ‌య‌లుదేరారు. ఇది గ‌మ‌నించిన స్థానికులు శ్రీ‌నివాస్‌, వినోద్‌ల‌ను నిల‌దీశారు. వీరే హ‌త్య చేసి ఉంటార‌నే అనుమానంతో దేహ‌శుద్ధి చేసి పోలీసులు అప్ప‌గించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ల‌క్ష్మీ అనారోగ్యంతో మృతి చెందిందా..? మ‌రేదైనా కార‌ణ‌మా..? అన్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అనారోగ్యం వ‌ల్లే..

అనారోగ్యం వ‌ల్లే ల‌క్ష్మీ మృతి చెందిన‌ట్లుగా భావిస్తున్నాం. స్థానికుల ఫిర్యాదు మేర‌కు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన‌ట్లు కేసు న‌మోదు చేశాం. పోస్ట్ మార్టం నివేదిక వ‌చ్చాక త‌దుప‌రి చ‌ర్య‌లు తీసుకుంటాం.

-బుగ్గ‌య్య‌, స‌బ్‌-ఇన్‌స్పెక్ట‌ర్, హ‌య‌త్‌న‌గ‌ర్


Next Story

Most Viewed